ఆ వార్తల్లో నిజం లేదు:సుష్మా స్వరాజ్‌

372
- Advertisement -

ఆంధ్రప్రదేవ్‌ గవర్నర్‌గా తనను నియమించనున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్‌. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన సుష్మా.. ఆ వార్తలు నిజం కాదన్నారు.

ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ నరసింహన్ భేటీ అవడంతో త్వరలో తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్‌లను నియమించనున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. సుష్మాస్వరాజ్‌ను ఏపీ గవర్నర్‌గా రాబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది.

ఈ వార్తలకు బలం చేకురేలా కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఓ ట్వీట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన సుష్మాస్వరాజ్‌కు అభినందనలు అని పేర్కొన్నారు. అయితే, ఆ తర్వాత కాసేపటికే మంత్రి తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో స్పందించారు సుష్మా.

harshavardhan

- Advertisement -