సురేష్ బాబు – రానా కేసు వెనుక కథేమిటి?

15
- Advertisement -

టాలీవుడ్ అగ్ర నిర్మాత‌గా డి.సురేష్ బాబుకి ఓ బ్రాండ్ ఉంది. ఇక ఆయ‌న త‌న‌యుడు రానా ద‌గ్గుబాటికి పాన్ ఇండియా వైడ్ గా ఫుల్ క్రేజీ ఉంది. అలాంటి వ్యక్తుల పై పోలీసులు కేసు న‌మోదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఫిల్మ్ న‌గ‌ర్‌కు సంబంధించిన భూ వివాదంలో డి.సురేష్ బాబు, రానాలు త‌న‌ను రౌడీల‌తో బెదిరించార‌ని ప్ర‌మోద్ కుమార్ అనే వ్య‌క్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలు ఈ భూ వివాదం ఏమిటి ?, ప్ర‌మోద్ కుమార్‌ కోర్టుకు ఎందుకు వెళ్ళాడు ?, కోర్టు జోక్యంతో సురేష్ బాబు, రానా స‌హా మ‌రి కొంత‌మందిపై పోలీసులు ఎందుకు కేసు న‌మోదు చేయాల్సి వచ్చింది ?. నిజంగా ఇవన్నీ ప్రేక్షకులకు అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఇప్పటివరకు అయితే, ఈ వ్య‌వ‌హారంపై సురేష్ బాబు, రానా ద‌గ్గుబాటి రియాక్ట్ కాలేదు. అసలు ఈ మొత్తం సినారియోలో గత కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్‌లోని కో ఆపరేటివ్ సోసైటీ పరిధిలో 1007 గజాల స్థలానికి సంబంధించిన వివాదం నడుస్తోంది. ఇదేం కొత్త వివాదం కూడా కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. ఆ స్థలం విషయంలో రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం సురేష్ బాబు నడుచుకోవడం లేదనేది ప్ర‌మోద్ కుమార్ ఆరోపణ. బంజారా హిల్స్‌కి చెందిన ప్ర‌మోద్ కుమార్ వద్ద డబ్బు తీసుకుని కూడా సురేష్ బాబు ఆ భూమి రిజిస్ట్రేషన్ చేయించటం లేదని ప్రమోద్ కుమార్ నాంపల్లి కోర్టులో ప్రైవేట్ కేసు వేశాడు. సురేష్ బాబుకి ప్ర‌మోద్ రూ.5 కోట్లు చెల్లించారట. ఈ వ్య‌వ‌హారంలో 5 కేసులు వివిధ కోర్టుల్లో ఉన్నాయి. మరి చివరకు ఈ వ్యవహారం ఎటువైపు వెళ్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

ఇవి రాకపోతే అవి చేస్తోందట!

ఆమిర్‌పై సెటైర్‌ వేసిన కంగనా..

వీన్ డీజిల్‌..ఫాస్ట్‌ ఎక్స్‌ ట్రైలర్‌ విడుదల

- Advertisement -