మొక్కలు నాటిన సురేష్ చుక్కపల్లి

208
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన మిత్రుడు TSMDC ఎండీ మల్సూర్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు చేవెళ్ల లోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు కన్సల్టెంట్ జనరల్ సౌత్ కొరియా సురేష్ చుక్కపల్లి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం వల్ల మనందరం కూడా చాలా బాధపడుతున్నాము అని ఈ కాలుష్యం తగ్గాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టారని. అందులో భాగంగా నేను కూడా ఈరోజు చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు. ఈ సందర్భంగా నా మిత్రులు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి చైర్మన్ శాంతా బయోటెక్; డాక్టర్ గురువారెడ్డి చైర్మన్ సన్ షైన్ హాస్పిటల్; ప్రొఫెసర్ సురేష్ కుమార్ VC EFLU; ప్రొఫెసర్ అప్పారావు VC HCU లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -