ధోనికి షాకిచ్చిన సుప్రీం కోర్టు!

105
- Advertisement -

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి షాక్ తగిలింది. మార్చి 2019లో, ధోనీ…అమ్రాపాలి సంస్థ తన సేవలకు సంబంధించి రూ. 40 కోట్లు పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం… ధోనీకి నోటీసు జారీ చేసింది. ఆమ్రపాలి గ్రూప్‌పై ఢిల్లీ హైకోర్టు చేసిన పిటిషన్‌పై విచారణ ప్రారంభించి మధ్యవర్తిత్వ చర్యలపై స్టే విధించింది.

ఆమ్రపాలి గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడాల్సి ఉందని పేర్కొన్నారు. ఆమ్రపాలి గ్రూప్ పాత యాజమాన్యం మధ్యవర్తిత్వ ప్రక్రియలో గృహ కొనుగోలుదారులకు న్యాయం జరగాలని సూచించారు. ఆమ్రపాలి, దాని డైరెక్టర్లకు నిరుపయోగంగా ఉన్న ఆస్తులను విక్రయించడం ద్వారా 700 కోట్ల రూపాయలను ఎలా సమకూర్చుకోవచ్చో అన్వేషించాలని నోయిడా, గ్రేటర్ నోయిడా అధికారులను కోర్టు కోరింది.

గృహ కొనుగోలుదారులపై అనవసరంగా భారం పడకూడదని పేర్కొంది. ప్రాజెక్టుల నిర్మాణానికి లోటును తీర్చేందుకు గృహ కొనుగోలుదారులు తమ ఫ్లాట్‌ల కోసం చదరపు అడుగుకు రూ. 200 చొప్పున అదనపు మొత్తాన్ని విధించవద్దని సూచించింది.

- Advertisement -