మ‌రో వ్యాపారంలోకి మ‌హేశ్ బాబు..

389
mahesh babu
- Advertisement -

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు సినిమాల‌తో పాటు వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్నారు. ఇటివ‌లే ఆయ‌న ఎయంబి పేరుతో మ‌ల్టీప్లేక్స్ బిజినెస్ ను ప్రారంభించిన విష‌యం తెలిసందే. తాజాగా ఉన్న స‌మాచారం మేర‌కు ఆయ‌న మ‌రో వ్యాపారంలోకి అడుగుపెట్ట‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఆయ‌న వెబ్ సిరీస్ ను తెర‌కెక్కించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇందుకోసం ఓ ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ తో మహేశ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

amb

హుస్సేన్ అనే దర్శకుడు ఈ సిరీస్ లను తెరకెక్కిస్తాడని సమాచారం. కాగా, ఈ వెబ్ సిరీస్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి చివర్లో లేదా ఫిబ్రవరి మొదటివారంలో ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. మ‌హేశ్ బాబుకు సొంతంగా బ్యాన‌ర్ కూడా ఉన్న విష‌యం తెలిసిందే. మ‌హేశ్ బాబు ప్రోడ‌క్ష‌న్స్ పేరుతో సినిమాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఆయ‌న బ్యాన‌ర్ లో బ్ర‌హ్మోత్స‌వం, శ్రీమంతుడు సినిమాల‌ను నిర్మించాడు. ఇక ప్ర‌స్తుతం ఆయ‌న వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హర్షీ అనే సినిమాను చేస్తున్నారు. ఈసినిమాకు దిల్ రాజు, అశ్వీనిద‌త్ లు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈమూవీని ఎప్రీల్ లో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు చిత్ర‌యూనిట్.

- Advertisement -