- Advertisement -
టీడీపీ అధినేత చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో మోసం చేసేందుకు వస్తున్నారన్నారు ఏపీ సీఎం జగన్. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన జగన్.. ప్రజల ప్రార్థనలే తనకు శ్రీరామ రక్ష అని చెప్పారు.
చంద్రబాబు మెంటల్ హెల్త్ ఎలా ఉందో చెక్ చేయాలని…బాబు జీవితంలో ప్రజలకు ఎన్నడూ మంచి చేసింది లేదన్నారు. ఇప్పుడు కొత్త హామీలతో వస్తున్నారని..నమ్మితే మోసపోతామన్నారు.
వెన్నుపోట్లు పొడవడం, మనుషులను హత్య చేయించడమే చంద్రబాబు రాజకీయమని..జగన్ ను చంపేస్తే తప్పు ఏంటని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, తనను ప్రజలే రక్షించుకుంటారని తెలిపారు. చంద్రబాబు జీవితంలో ఎన్నడూ ప్రజలకు మంచి చేయలేదు, ఇప్పుడు మళ్లీ కొత్త హామీలతో వస్తున్నారని చెప్పారు.
Also Read:చికెన్ తింటున్నారా.. జాగ్రత్త !
- Advertisement -