గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే రవిశంకర్‌ సతీమణి..

230
Sunke Deevana
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు తన పుట్టినరోజును పురస్కరించుకొని మొక్కలు నాటారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ సతీమణి సుంకె దీవెన. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఈ రోజు నా జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం పచ్చదనాన్ని పెంచడం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం ప్రజలలో అవగాహన పెంచడం జరుగుతుంది అని ఆమె తెలిపారు.

- Advertisement -