మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి బాధ్య‌త‌లు..

121
Sunita Laxma Reddy
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి శుక్ర‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యులుగా షాహీన్ ఆఫ్రోజ్‌, గ‌ద్ద‌ల ప‌ద్మ‌, కుమ్ర ఈశ్వ‌రీబాయి, సూదం ల‌క్ష్మి, ఉమాదేవి యాద‌వ్‌, రేవ‌తీరావు బాధ‌త్య‌లు స్వీక‌రించారు. ఈరోజు బుద్ధ‌భ‌వ‌న్ క‌మిష‌న్ కార్యాల‌యంలో బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. చైర్‌ప‌ర్స‌న్ సునీతా ల‌క్ష్మారెడ్డితో పాటు మిగ‌తా స‌భ్యుల‌కు మంత్రి కేటీఆర్ పుష్ప‌గుచ్ఛం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు.

- Advertisement -