భారత్-ఆస్ట్రేలియా నాలుగో టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా శ్రమిస్తోంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏడు, ఎనిమిదో స్థానాల్లో క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ మాత్రం చక్కగా రాణిస్తున్నారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఇప్పటికే ఏడో వికెట్కు సెంచరీకిపైగా పార్ట్నర్షిప్ నెలకొల్పడం విశేషం. 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియాను ఈ ఇద్దరు బౌలర్లూ ఆదుకున్నారు.
ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్ 53, శార్దూల్ ఠాకూర్ 64 పరుగులతో ఉన్నారు. టెస్టుల్లో వాషింగ్టన్ సుందర్ కి ఇది తొలి అర్ధ శతకం. ఆడుతోన్న మొట్టమొదటి టెస్టు మ్యాచులోనే ఆయన అర్ధ శతకం సాధించాడు. కాగా, శార్దూల్ సిక్సర్ తో అర్ధ శతకం చేయడం గమనార్హం. వారిద్దరు రాణిస్తుండడంతో టిమిండియా స్కోరు 100 ఓవర్ల నాటికి 305/6 గా ఉంది. గబ్బా స్టేడియంలో ఇండియన్ టీమ్కు ఏడో వికెట్కు ఇదే అత్యధిక పార్ట్నర్షిప్.