రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి పాఠశాలలకు సెలవులు..

153
Sabitha Indra Reddy
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు అమల్లో ఉంటాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈరోజు సెలవులపై ఆమె ప్రకటన చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ అన్ని విషయాలపైనా చర్చించారని చెప్పారు. ఆ తర్వాతే సెలవులపై నిర్ణయం తీసుకున్నారన్నారు. పాఠశాలలు, కాలేజీ పున:ప్రారంభంపై జూన్ 1న నిర్ణయం తీసుకుంటామన్నారు.

కరోనా విస్తరిస్తున్న‌ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు మంత్రి తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దినంగా పరిగణిస్తామని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -