మహేష్ బాబు మూవీకి 150 కోట్లు..

197
Mahesh-Babu
- Advertisement -

ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ బడ్జెట్‌లో సినిమాలు తెరకెక్కించి ఎక్కవ వసూళ్లు సాధించేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్‌ మారింది. అగ్ర హీరోల సినిమాలకు ఎంత ఎక్కువ డబ్బులు పెడితే అంత సినిమా హిట్‌ అవుతుందనే భావనతో కోట్లకు కోట్లు పెడుతున్నారు.. గతంలో పెద్ద హీరోల సినిమాలు 30 నుంచి 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించేవారు.. ఆ తర్వాత బడ్జెట్‌ 50 కోట్లకు చేరింది.. అయితే ఇప్పుడు ఏకంగా అగ్ర హీరోల సినిమాలకు 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. చిరంజీవి సైరా.. ప్రభాస్‌ సాహో వంటి సినిమాలు ఏకంగా 200 కోట్ల మార్కును దాటబోతున్నాయని తెలుస్తోంది.

mahesh babu

అయితే టాలీవుడ్‌లో ప్రిన్స్‌ మహేష్‌ బాబు తన కెరియర్‌లో 25వ చిత్రంగా తెరకెక్కుతున్న మహర్షి సినిమా వంశి పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. సమ్మర్‌లో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్‌. అయితే ఈలోపే మహేష్‌ బాబు తన 26వ సినిమా ఫ్లాన్‌ చేస్తున్నారు. రంగస్థలం మూవీ దర్శకుడు సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ పై ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్‌ వేస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఈ సినిమాను తెరకెక్కించడానికి మైత్రి మూవీ మేకర్స్‌ వారిని సుకుమార్‌ 150 కోట్లు అడిగాడని తెలుస్తోంది. టెక్నికల్‌ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కించడానికి సుక్కు 150 కోట్లు అడిగినట్టు సమాచారం. ఈ బడ్జెట్‌ మూవీ మేకింగ్‌కు, రెమ్యునరేషన్స్‌కే ఖర్చవుతుందని సమాచారం.

Mahesh-Babu

మహేష్‌ బాబు, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ఈ మూవీని నిర్మించడానికి మైత్రీ మూవీ మేకర్స్‌ వారు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. చూడాలి మరి సుకుమార్‌ మహేష్‌ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్‌ చేస్తుందో..

- Advertisement -