సిస్టర్స్ 4 ఛేంజ్…సైకత శిల్పం

218
sudarsan pattnaik sand art on raksha bandhan
- Advertisement -

అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుంబంధం రాఖీ పండుగ‌.. సోద‌రుడు క్షేమంగా ఉండి జీవితాంతం త‌న‌కు ర‌క్ష‌ణ‌గా ఉండాల‌ని, కొరుకుంటూ రాఖీ క‌డుతారు. అలాగే సోదరులు తమ అక్కచెల్లెళ్లకు బహుమతులు అందజేస్తారు. అయితే ఈ రక్షా బంధన్‌కు మాత్రం సోదరీమణులే అన్నదమ్ములకు హెల్మెట్‌ను గిఫ్టుగా ఇవ్వాలని   ఎంపీ  కల్వకుంట్ల కవిత  ప్రచారం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ‘సిస్టర్స్ ఫర్ ఛేంజ్’ అంటూ చేపట్టిన ప్రచారానికి మంచి స్పందన వస్తోంది.

పలువురు సినీ,రాజకీయ,క్రీడా రంగ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఎంపీ కవితపై ప్రశంసలు గుప్పించగా పూరీ తీరాన ఏకంగా సైకత శిల్పమే వెలిసింది. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ‘సోదరుల భద్రత కోసం చేతులు కలుపుదాం’ అంటూ రాఖీ ఆకారాన్ని నిర్మించి దేశ ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కవిత సూచించిన #GiftAHelmet హ్యాష్ ట్యాగ్‌ను కూడా చెక్కారు.

ఈ నేపథ్యంలో కవిత ఇచ్చిన ప్రేరణతో అన్నదమ్ములకు హెల్మెట్ ఇస్తు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు సోదరీమణులు.  ఎంపీ క‌విత ఇవాళ త‌న అన్న మంత్రి కేటీఆర్ కు రాఖీ క‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ క‌విత తాను ప్రారంభించిన సిస్ట‌ర్స్ ఫ‌ర్ చేంజ్ లో భాగంగా అన్న కేటీఆర్ కు రాఖీ క‌ట్టి హెల్మెట్ ను బ‌హుక‌రించారు. త‌ర్వాత మంత్రి కేటీఆర్.. చెల్లెలు క‌విత కు చేనేత చీర‌ను బ‌హుక‌రించారు.

sudarsan pattnaik sand art on raksha bandhan

- Advertisement -