భార్యను కాల్చి చంపి .. తానూ కాల్చుకున్న ఎస్సై

211
Sub-inspector commits suicide
- Advertisement -

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో దారుణం చోటుచేసుకుంది.  భార్యను సర్వీసు రివాల్వర్‌తో కాల్చి చంపి తాను కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ ఎస్సై. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్‌క్వార్టర్స్‌లో శుక్రవారం జరిగింది. దుబ్బాక ఎస్సైగా పనిచేస్తున్న చిట్టిబాబుపై అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఆయన్ను డీసీపీకి సరెండర్ చేశారు.

దీంతో మనస్తాపం చెందిన చిట్టిబాబు  త‌న భార్య‌ను త‌న స‌ర్వీసు రివాల్వ‌ర్‌తో కాల్చాడు. అనంత‌రం తాను కూడా కాల్చుకుని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. ఈ ఘ‌ట‌న‌లో చిట్టిబాబు భార్య అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, స‌ద‌రు ఎస్సై చావుబతుకుల మ‌ధ్య ఆసుప‌త్రిలో పోరాడుతున్నారు. ప్రస్తుతం చిట్టిబాబును చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ‌డానికి కుటుంబ క‌ల‌హాలే కార‌ణ‌మా? అనే అంశంపై ఆరా తీస్తున్నారు.

- Advertisement -