ఉక్రెయిన్ నుండి హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ విద్యార్థులు..

118
- Advertisement -

ఉక్రెయిన్ నుంచి భార‌తీయుల‌ను తీసుకొచ్చిన 3వ విమానం క్షేమంగా ఢిల్లీకి చేరుకుంది. ఇందులో 240 మంది భార‌తీయ విద్యార్థులు ఉన్నారు. బుడాపెస్ట్ నుంచి బ‌య‌ల్దేరిన ఈ విమానం ఆదివారం ఉద‌యానికి ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంది. కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషి ఈ విద్యార్థులంద‌రికీ స్వాగ‌తం ప‌లికారు. ఇక భారత్ దేశం చేరుకున్న తెలంగాణ విద్యార్థులు, ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ అధికారులు మరియు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వారిని శంషాబాద్ విమానాశ్రయం వద్ద రిసీవ్ చేసుకున్నారు.

- Advertisement -