కడుపుబ్బరం తగ్గించేందుకు…

197
- Advertisement -

1.జీలకర్ర ను నీటిలో వేసి రసం తీసి ఆ రసాన్ని 3 పూటలా ఒక స్పూన్ చొప్పున తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది

2.మెంతుల్ని మెత్తగా పొడి చేసి పూటకు ఒక స్పూను చొప్పున నీటితో మింగాలి.ఇలా రోజుకు రెండుసార్లు తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

3.జీడి మామిడి పండ్లు కొన్ని తీసుకొని వాటి రసం ఒక కప్పులో పోసి ఒకే మోతాదు లో తాగాలి .రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

4.జాజికాయ ,జాపత్రి ,శొంఠి ,లవంగాలు, యాలకులు, చలవ మిరియాలు వీటిన్నిటినీ సమభాగాలుగా తీసుకొని బాగా చూర్ణం చేసుకొని రోజూ అర స్పూన్ చొప్పున ప్రతి రోజు రెండు పూటలా తీసుకుంటే కడుపుబ్బరం తగ్గుతుంది.

5.మారేడు ఆకుల రసం రెండు స్పూన్లు తీసుకొని దానిలో నాలుగు మిరియాలు చూర్ణం చేసి కలిపి తాగితే కడుపుబ్బరం తగ్గిపోతుంది.

6.ఒక పసుపు కొమ్మును ఒక కప్పు పాలలో వేసి దాన్ని బాగా మరగకాచి చల్లార్చి వడగట్టి ఆ పాలను ఉదయం,సాయంత్రం తాగుతూ ఉంటే కడుపుబ్బరం తగ్గిపోతుంది.

7. ఒక గ్లాస్ పాలు తీసుకుని దానిలో కొంచెం నేల ఉసిరి ఆకులు వేసి బాగా మరిగించి ఆ పాలను వడపోసి తాగితే కడుపుబ్బరం తగ్గుతుంది.

8.శనగ గింజంత ఇంగువను రోజూ మూడు పూటలా తీసుకుంటే కడుపుబ్బరం తగ్గుతుంది

9. ప్రతి ఆరు గంటలకొకసారి నాలుగు వెల్లుల్లి రేకల్ని నమిలి మింగితే ఉబ్బురంతగ్గిపోతుంది.పచ్చి కాకరకాయ రసం ప్రతి రోజూ ఉదయం,సాయంత్రం ఒక స్పూన్ చొప్పునా తీసుకుంటే కడుపుబ్బరం తగ్గించడంలో సహాయపడుతుంది ఇది అన్నింటి కంటే ఉత్తమం.

Also Read:ఖుష్బూ పై ‘యానిమల్’ లవర్స్ ఫైర్

- Advertisement -