బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు

74
- Advertisement -

సింగరేణిని కాపాడుకుంటామని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. శాసనసభలో ఈ మేరకు మాట్లాడిన కేటీఆర్..సింగ‌రేణిని ప్ర‌యివేటుప‌రం చేయాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వ కుట్ర‌ను భగ్నం చేస్తామ‌ని…సింగ‌రేణి కార్మికుల‌ను, అన్ని రాజ‌కీయ ప‌క్షాల‌ను క‌లుపుకొని ఉద్య‌మానికి శ్రీకారం చుట్టి సింగ‌రేణిని కాపాడుకుంటామ‌ని తేల్చి చెప్పారు.

2004 నుంచి 2014 వ‌ర‌కు ఇసుక‌పై రూ. 39 కోట్ల 40 ల‌క్ష‌ల ఆదాయం వ‌చ్చింది. కాంగ్రెస్ హ‌యాంలో సంవ‌త్స‌రానికి 4 కోట్లు కూడా రాలేదు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో.. ఇప్పుడు ఏడాదికి రూ. 800 కోట్ల ఆదాయం వ‌స్తుందన్నారు.సింగ‌రేణి బొగ్గు గ‌నుల విష‌యంలో ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రుల‌కు సీఎం కేసీఆర్ లేఖ రాశారని..నాలుగు బొగ్గు గ‌నులు త‌మ‌కే ఇవ్వాల‌ని లేఖ‌లో పేర్కొన్నారని చెప్పారు.

బ‌య్యారం విష‌యంలో కేంద్రం నిస్సిగ్గుగా మాట త‌ప్పింది. బ‌య్యారంలో స్టీల్ నిక్షేపాలు లేవ‌ని కేంద్ర మంత్రి అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నారు. కేంద్రం ముందుకు రాక‌పోతే ప్ర‌యివేటు రంగం ద్వారానైనా లేదా సింగ‌రేణి ద్వారానైనా బ‌య్యారం స్టీల్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తాం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -