2 నిమిషాలు మౌనం పాటించండి..

173
- Advertisement -

ఈ నెల 30న అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కానుంది. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం( జనవరి-30) తెలంగాణ వ్యాప్తంగా 2 నిమిషాలు మౌనం పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

రేపు (మంగళవారం) ఉదయం 11 గంటల నుంచి 2 నిమిషాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మౌనం పాటించాలని స్పష్టం చేసింది. ఆ సమయంలో రహదార్లపై వాహన రాకపోకలు కూడా నిలిపివేయాలని అధికారులకు సూచించింది. సరిగ్గా ఉదయం 11 గంటలకు మౌనం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Stand together in silence for 2 minutes..

స్వాతంత్య్రం కోసం బలిదానం చేసిన వారి త్యాగాలను స్మరించుకుంటూ మౌనం పాటించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -