‘దృశ్యం’ దర్శకుడిపై రాజమౌళి ప్రశంసలు..

224
SS Rajamouli
- Advertisement -

టాలీవుడ్‌ దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దృశ్యం చిత్ర దర్శకుడు జీతు జోసెఫ్‌పై సంచలన కామెంట్ చేశారు. మలయాళంలో వచ్చిన దృశ్యం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇండియా వైడ్ గా సంచలన విజయం సాధించింది. దాదాపుగా భారత్ లోని అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ ఇది రీమేక్ అయ్యింది. తెలుగులో వెంకటేష్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా ఇక్కడ కూడా అద్బుతమైన సక్సెస్ అందుకుంది.

కాగా, ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన మలయాళం దృశ్యం-2 అదరగొడుతున్న సంగతి తెలిసిందే. మొదటి పార్టుకు ఏ మాత్రం తగ్గకుండా అద్భుతంగా సాగిన ఈ సినిమా.. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో తాను కూడా సినిమా చూశానని దర్శకుడు జీతూకు మెసేజ్ చేశాడు రాజమౌళి. అయితే.. ఈ సినిమా గురించి జక్కన్న తన అభిప్రాయం తెలియజేశారు. అదికూడా.. జీతు జోసెఫ్‌కు పర్సనల్‌గా మెసేజ్ చేశారు. ఆ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో కనిపించడంతో వైరల్ గా మారింది.

‘‘హాయ్ జీతూ.. నేను రాజమౌళిని. ఈ మధ్యనే దృశ్యం-2 చూశాను. ఆ వెంటనే మొదటి పార్టు చూశాను. గతంలో తెలుగు వెర్షన్ చూశాను. ఇప్పుడు మలయాళీ వర్షన్ చూశాను. ఈ సినిమా డైరెక్షన్ స్క్రీన్ ప్లే అన్నీ అద్భుతంగా ఉన్నాయి. మొత్తంగా ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ఉంది. మీ నుంచి ఇలాంటి మాస్టర్ పీస్ లు ఇంకా రావాలని ఆశిస్తున్నా’’ అని మెసేజ్ చేశాడు.

- Advertisement -