మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఏడేళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్న భారత ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ తాజాగా క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. 2013 ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడి శ్రీశాంత్ దోషిగా తేలడంతో అతడిపై ఏడేళ్ల పాటు నిషేధాన్ని విధించింది బీసీసీఐ. 2020 సెప్టెంబర్తో నిషేధం ముగిసిన భారత్ తరపున ఆడేందుకు అవకాశం రాకపోవడంతో క్రికెట్కు వీడ్కోలు పలికాడు.
టీ20,వన్డే,టెస్టు మూడు ఫార్మాట్ల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు శ్రీశాంత్. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకు క్రికెట్ కు ముగింపు పలుకుతున్నానని…ఇది తన సొంత నిర్ణయమని అన్నారు. తన జీవితంలో తాను తీసుకున్న ఒక గౌరవప్రదమైన నిర్ణయం ఇది అని చెప్పాడు. దేశానికి ఆడటం తనకు ఎంతో గర్వకారణమని చెప్పాడు.
భారత్ తరపున శ్రీశాంత్ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 87 వికెట్లు, వన్డేల్లో 75, టీ20ల్లో 7 వికెట్లు పడగొట్టాడు.