శ్రీశైలం ప్రాజెక్టు..10 గేట్లు ఎత్తివేత

7
- Advertisement -

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం జలాశయానికి 3.93 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. దీంతో జలాశయం 10 గేట్లను 20 అడుగుల వరకు ఎత్తి స్పిల్‌వే ద్వారా 3.10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులుగా నీరు ఉంది.

ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ద్యం 215.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 204. 35 టీఎంసీల నీరు ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి చేసి 64,338 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

నాగార్జునసాగర్‌ జలాశయం ఇన్‌ ఫ్లో 3,54,831గా ఉండగా 22 గేట్లు ఎత్తి 3,14,761 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తి నీటిమట్టం 590 అడుగులకు గాను 585.40 అడుగులకు వరకు నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం 298.58 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Also Read:కమిటీ కుర్రోళ్లు అందరినీ అలరిస్తుంది: చిరంజీవి

- Advertisement -