శ్రీరాంసాగర్ 25 గేట్లు ఎత్తివేత..

268
sriramsagar project
- Advertisement -

నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. 1,23,427 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అంతే ప్రవాహాన్ని 25 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండింది.

భారీ వర్షాలతో సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్‌ జలాశయానికి ఇన్‌ఫ్లో స్ధిరంగా కొనసాగుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.72 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 523.6 మీటర్లు కాగా ప్రస్తుతం 520.5 మీటర్లకు చేరింది.

ఎగువ నుంచి 19,032 క్యూసెక్కుల వరద వస్తోంది. 120 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రవాహం ఇలాగే కొనసాగితే మరోనాలుగైదు రోజుల్లో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరే అవకాశం ఉంది.

- Advertisement -