వైభవంగా శ్రీరామపట్టాభిషేకం..

28
- Advertisement -

శ్రీరామనవమి సందర్భంగా భద్రచాలం శ్రీసీతారామచంద్ర స్వామి పట్టాభిషేకం కన్నుల పండువగా జరిగింది. మిథిలా ప్రాంగణంలో మేళతాళాల నడుమ సీతారాములు కళ్యాణం అంగరంగవైభవంగా జరుగగా ఇవాళ శ్రీరామ పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టాభిషేక మహోత్సవానికి భారీగా భక్త జనం తరలిరాగా గవర్నర్‌ తమిళి సై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

విశ్వక్సేన ఆరాధనతో పట్టాభిషేకం మహోత్సవం ప్రారంభం కాగా పవిత్ర నదీ జలాలతో స్వామివారికి అభిషేకం జరిపి అష్టోత్తర, సహస్రనామార్చన, సువర్ణ పుష్పార్చన గావించారు. అభిజిత్‌ ముహూర్తంలో రజిత సింహాసనంపై సీతారామచంద్రస్వామి పట్టాభిషిక్తుడయ్యారు. పట్టాబిషేకం కోసం దేశంలోని 12 నదుల నుండి పవిత్రజలాలను తీసుకొచ్చారు.

సీతారాముల పట్టాభిషేక మహోత్సవానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామి వారి పట్టాభిషేకానికి భక్తులు తరలిరావడంతో భక్తజన సంద్రోహంగా మారింది. శ్రీరాముడికి పట్టాభిషేకం నిర్వహించే సమయంలో రామదాసు చేయించిన ఆభరణాలను ధరింపజేయడం ఆనవాయితీ.స్వర్ణఛత్ర, స్వర్ణపాదుక, రాజ దండ, రాజపట్ట, రాజముద్ర, సామ్రాట్‌ కిరీటం ఇలా ఒక్కో ఆభరణాన్ని భక్తులకు చూపిస్తూ, వాటి విశిష్టతను తెలుపుతూ స్వామివారికి అలంకరించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -