గ్రీన్ ఛాలెంజ్ పాల్గొన్న పర్యావరణ ప్రేమికులు శ్రీనివాస్ రావు..

222
Srinivas Rao
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా దుండిగాల్ చెందిన పర్యావరణ ప్రేమికులు శ్రీనివాస్ రావు 116 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ఈ రోజు రాజ్యసభ సభ్యులు సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని 116 మొక్కలు, దుండిగల్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో నాటడం జరిగింది.

ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న ఎంపీ సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని మనందరం నియంత్రించాలని అందుకోసం బాధ్యతగా మొక్కలు నాటినందుకు ఎంపీ సంతోష్ కుమార్ శ్రీనివాస్ రావును ట్విట్టర్ వేదికగా అభినందించారు.

- Advertisement -