వెంటిలేటర్‌పై కాంగ్రెస్‌: శ్రీనివాస్ గౌడ్

528
Srinivas Goud
- Advertisement -

ప్రజలు ఛీ కొట్టినా కాంగ్రెస్ నేతల తీరు మారడం లేదని మండిపడ్డారు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌. టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్‌ గౌడ్‌ కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తుంటే టీఆర్ఎస్ ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారని చెప్పారు.

కాంగ్రెస్ వెంటిలేటర్ మీద ఉందని … ప్రజల వెంట ఉండాలనే కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు కూడా టీఆర్ఎస్‌లోకి వచ్చారని చెప్పారు. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా పోయిందని … సచివాలయం ,అసెంబ్లీ నిర్మాణాల పై కాంగ్రెస్ నేతలది అనవసర రాద్ధాంతమన్నారు.

నిజాం అప్పట్లో అసెంబ్లీ కడితే ఇపుడు వాడుకుంటున్నాము ..నిజాం తనకోసం కట్టుకున్నారా ?…కెసిఆర్ కూడా తన కోసం సచివాలయం ,అసెంబ్లీ కట్టుకోవడం లేదన్నారు. ముందు చూపు తోనే భవిష్యత్ తరాల కోసమే కొత్త నిర్మాణాలు …పాత భవనాలన్నీ హెరిటేజ్ భవనాలు కాదు …హెరిటేజ్ భవనం గుర్తింపు కోసం కొన్ని పద్దతులు ఉంటాయని చెప్పారు.

కాళేశ్వరం ,పాలమూరు రంగారెడ్డి ప్రాజేక్టు లు అడ్డుకోవడానికి కోర్టులకు వెళ్ళిన కాంగ్రెస్ నేతలు ఇపుడు సచివాలయం ,అసెంబ్లీ ల పై అదే పంథా కొనసాగిస్తున్నారు …ప్రతి పక్ష హోదా పోయింది కాబట్టే కాంగ్రెస్ నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు …గతం లో విలువైన ప్రభుత్వ భూములు ,కంపెనీ లు అమ్ముకున్న కాంగ్రెస్ నేతలకు సచివాలయం ,అసెంబ్లీ లకు అద్భుత కట్టడాలు ఉండాలన్న ఆలోచన రాలేదన్నారు.

వాషింగ్టన్ పోస్టు ,న్యూయార్క్ టైమ్స్ లాంటి అంతర్జాతీయ పత్రికలు కాళేశ్వరం కెసిఆర్ పాలనను పొగుడుతుంటే కాంగ్రెస్ నేతలు చవకబారు గా మాట్లాడుతున్నారు …కెసిఆర్ ను విమర్శించే స్ధాయి కాంగ్రెస్ నేతలకు లేదు …రాదు కూడా …కెసిఆర్ ఎంత విమర్శిస్తే కాంగ్రెస్ ప్రజల్లో అంత చులకన అవుతోంది …కాంగ్రెస్ నేతలూ తలకింద ,కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసినా కెసిఆర్ సచివాలయం ,అసెంబ్లీ నిర్మాణాలు ఆపరన్నారు.

కాంగ్రెస్ ధర్నాలకు భయపడి కెసిఆర్ ఒక్క ఇంచు కూడా వెనక్కి తగ్గరు …కాంగ్రెస్ నేతలు రైతు బంధు చెక్కులు తీసుకుంటారు ,ప్రభుత్వ పథకాలు అనుభవిస్తుంటారు .అయినా కెసిఆర్ పై కడుపు మంట ప్రదర్శిస్తుంటారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ పై అక్కసు తోనే ప్రతి దాని పై బురద చల్లే విధంగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు.

చెట్ల కింద ,గుడారాల కింద పాలన సాగాలన్నట్టుగా కాంగ్రెస్ నేతల తీరు ఉంది …కాంగ్రెస్ హాయం లో వేల కోట్ల భూములు ధారాదత్తం చేశారు …ప్రజల కోసమే కొత్త సచివాలయం ,అసెంబ్లీ …తెలంగాణ కు కొత్త సచివాలయం ,అసెంబ్లీ కట్టడాలు చారిత్రాత్మకం కానున్నాయి …కాంగ్రెస్ నేతలు కూడా కొత్త భవనాలు కట్టాక కెసిఆర్ ను పొగడక తప్పదన్నారు.

ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని …చట్టానికి ఎవరూ అతీతులు కారు …ఎమ్మెల్యే కు సోదరుడు ,జడ్పీ వైస్ చైర్మన్ అయినప్పటికీ కాగజ్ నగర్ ఘటన లో ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకుందన్నారు. టీఆర్ఎస్ నేతలకు చెందిన ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నా ఫీజులు పెంచుకునేందుకు సీఎం నిరాకరించారని… .పేకాట క్లబ్బులు మూయించారని చెప్పారు.

- Advertisement -