మురికినీటిని తొలగించండి: శ్రీనివాస్ గౌడ్

327
srinivas goud
- Advertisement -

రాష్ట్ర పురపాలక మరియు పరిశ్రమల శాఖ మంత్రి KT రామారావు పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం10 గంటల10 నిమిషాల కు కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ .హైదరాబాద్ లోని బేగంపేట లో ఉన్న పర్యాటక భవన్ ప్లాజా హోటల్ లో డెంగ్యూ దోమలు పెరగడానికి అవకాశమున్న ప్రాంతాలయినటువంటి వర్షపునీరు నిల్వ ఉన్న ప్రాంతాలు, పూలతొట్టి లోని నీటిని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు స్వయంగా పరిశీలించి, నీటిని తొలగించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దోమల ద్వారా సంక్రమించే అన్ని రకాల సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా మంత్రి కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అవగాహన కార్యక్రమాలను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఈ గొప్ప కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. డెంగ్యూ వ్యాధి నివారణ లో భాగంగా ప్రతి ఒక్కరూ వారి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా ఇంత గొప్ప కార్యక్రమానికి పిలుపునిచ్చిన మంత్రి KT రామారావు కి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -