బీసీల జనాభా.. నివేదిక తప్పుల తడక!

1
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వ నిన్న ప్రకటించిన నివేదిక తప్పుల తడక అని మండిపడ్డారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్..రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందన్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేశారు.. ఎన్నికల కోసం తప్పుడు నివేదికలను ప్రకటించారు అన్నారు.

దేశంలో బీసీల జనాభా ఎంత ఉందో తెలియదు,బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు.. మా అంచనా ప్రకారం తెలంగాణ జనాభా 4 కోట్లకు పైగా ఉంటుందన్నారు. ఓటర్లు 3 కోట్ల 40 లక్షల మందికి పైగా ఉన్నారు.. ప్రభుత్వం చిల్లర వ్యవహారాలతో ఉద్యమాలు పుట్టుకు వస్తున్నాయి అన్నారు.

బీసీల జనాభా 60 శాతానికి పైగా ఉండాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా దగ్గర సర్వే కాలేదని అంటున్నారు, 2011 కంటే ఇప్పుడు ముస్లింల జనాభా తగ్గినట్లు చూపించారు అన్నారు. బిహార్ లో బీసీల జనాభా 10 శాతం పెరిగినట్లు చెప్పి కులాల వారీగా జాబితా ఇచ్చారు.. సంవత్సరం వరకు కాలయాపన చేసి ఇప్పుడు హడావుడి చేస్తున్నారు అన్నారు.

Also Read:భక్తజనసంద్రంగా మహాకుంభమేళ

4వేల పేజీల నివేదికను ఎమ్మెల్యేలు ఎప్పుడు ప్రిపేర్ కావాలి..అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి చేతులు దులుపుకుంటారు, బీజేపీతో మాట్లాడి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. మీ ఎమ్మెల్యేలు ఎన్ని బాధలు పడుతున్నారో చూస్తున్నాం అన్నారు.

తెలంగాణలో కులాల మధ్య కొట్లాటలు పెడుతున్నారు.. మాకు ట్యాబ్ లు ఇస్తే మేము సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తాము, తెలంగాణలో మరో
బీసీ ఉద్యమం వస్తుందన్నారు.

- Advertisement -