టీమిండియాను చిత్తుచేసిన శ్రీలంక..

55
- Advertisement -

పూణె వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్‌ను చిత్తు చేసింది శ్రీలంక. టీమిండియాపై 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. లంక విధించిన 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హార్ధిక్ సేన ఆరంభంలోనే చేతులెత్తేసింది. టాప్ ఆర్డర్ ఒక్కరొక్కరుగా పెవిలియన్ బాటపట్టారు. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ భారత్ తక్కువ స్కోరుకే ఆలౌట్ కాకుండా కాపాడారు. వీరిద్దరి ఆటతీరుతో భారత్ ఓ దశలో గెలుస్తుందా అనిపించిన వీరిద్దరూ ఔట్ కావడంతో భారత్ ఓటమి తప్పలేదు.

సూర్య, అక్షర్ ఇద్దరు హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఇక ముఖ్యంగా అక్షర్ పటేల్ సిక్స్‌ల వర్షం కురిపించాడు. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఈ విజయంతో మూడు టీ20 మ్యాచ్ ల సీరిస్ ను 1-1తో శ్రీలంక సమం చేసింది.

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్ మెండిస్ ఆఫ్ సెంచరీ చేయగా, అసలంక 19 బంతుల్లోనే 37 పరుగులతో రాణించారు. చివర్లో కెప్టెన్ శనక ఆకాశమే హద్దుగా చెలరేగి 20 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేయడంతో స్కోర్ 200 దాటింది. శనివారం మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -