పాక్‌ను చిత్తుచేసిన లంక..

118
sl
- Advertisement -

ఆసియా కప్‌లో తొలుత పేలవ ప్రదర్శన కనబర్చిన శ్రీలంక తాజాగా అద్భుత ఆటతీరుతో ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. ఆసియా కప్ గ్రూప్ 4 చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తుచేసింది. 122 పరుగుల లక్ష్యచేధనలో బరిలోకి దిగిన శ్రీలంక కేవలం 17 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి టార్గెట్‌ని చేధించింది. ఓపెనర్‌ నిస్సాంక (55) అజేయ అర్ధసెంచరీ సాధించగా, రాజపక్స (24), షనక (21) ఆకట్టుకున్నారు. రౌఫ్‌, హస్నైన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హసరంగ నిలిచాడు.

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన పాక్‌.. లంక బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. బాబర్‌ ఆజమ్‌ (30), నవాజ్‌ (26) మాత్రమే రాణించారు. హసరంగకు మూడు, తీక్షణ.. ప్రమోద్‌ మదుశాన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.

- Advertisement -