గ్రీన్ ఛాలెంజ్‌లో శ్రీలంక నటి రాశిప్రభ

55
- Advertisement -

ప్రకృతిని అర్థం చేసుకుంటే ప్రపంచంలో సమస్యలే ఉండవన్నారు బాలీవుడ్ నటి రాశిప్రభ సందీపని. తన తాజా సినిమా షూటింగ్ లో భాగంగా ఇవాళ హైదరాబాద్ వచ్చిన ఈ నటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు.

అనంతరం రాశిప్రభ మాట్లాడుతూ.. తను పుట్టి పెరిగిన శ్రీలంకలో ప్రకృతికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్లే.. ఇప్పటికి నదులు, అడవులు సురక్షితంగా ఉన్నాయని. వీటి వల్లే శ్రీలంకకు టూరిజం పెరిగి లక్షల మందికి ఉపాధి కలుగుతుందని ఆమే అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు తగ్గాలంటే మొక్కలు పెంచడం ఒక్కటే మార్గమని.. అందులో భాగంగా ఇండియా లో *రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం ప్రారంభించడం.. ఉద్యమంలా ముందుకు తీసుకుపోవడం చాలా సంతోషం కలిగించింది.

ప్రపంచంలో అనేక దేశాల్లో పర్యాటించాను.. అనేక మంది పర్యావరణవేత్తలను కలిసాను.. కానీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి వినూత్నమైన కార్యక్రమాన్ని నేను ఎక్కడా చూడలేదు. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించి కోట్లాది మొక్కలు నాటిస్తున్న సంతోష్ కుమార్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని శ్రీలంకలో విస్తరించేలా నా వంతుగా కృషి చేస్తానని ఆమే తెలిపారు.

Also Read:మళ్లీ మృణాల్ తోనే ఫిక్స్ అట

- Advertisement -