శ్రీలంకలో ఆందోళనలు… ఎంపీ మృతి

105
sl
- Advertisement -

శ్రీలంకలో సంక్షోభం మరింత ముదరింది. ఇప్పటికే ఆర్ధిక సంక్షోభంతో అల్లాడుతున్న ప్రజలు..ప్రభుత్వంపై తమ నిరసనను వివిధరూపాల్లో చేపడుతున్నారు. తాజాగా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నివాసాలు, వాహనాలకు ఆందోళన కారులు నిప్పుపెట్టగా ఈ క్రమంలో జరిగిన అల్లర్లలో అధికార పార్టీ ఎంపీ, ఆయన సెక్యూరిటీ అధికారి మరణించారు. నిరసనకారులపై ప్రభుత్వ సెక్యూరిటీ లాఠీలతో విరుచుకుపడింది.

అలాగే అధికార పార్టీ ఎంపీ సనత్ నిశాంత ఇంటికి నిప్పుపెట్టారు. ఆయన ఇల్లు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. గాలెలోని మంత్రి రమేష్ పతిరాన, మౌంట్ లావినియాలోని మాజీ మంత్రి జాన్స్టన్ ఫెర్నాండో నివాసాలతోపాటు ఇళ్ళు, వాహనాలకు కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దీంతో శ్రీలంక వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు.

- Advertisement -