గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న శ్రీశ్రీ రవి శంకర్ స్వామీజీ..

187
- Advertisement -

మొక్కల యజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నిర్విఘ్నంగా కొనసాగుతుంది. సామాన్యుల నుంచి సాధువులు, గురువుల వరకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటుతూ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను ముందుకు తీసుకుపోతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ప్రముఖ యోగ గురువు, ఆధ్యాత్మిక నాయకుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపకులు శ్రీ.శ్రీ. రవి శంకర్ గారు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” భాగంగా శంకర్ పల్లిలోని మానస గంగా ఆశ్రమంలో ఉసిరి మొక్కనను నాటారు. ఈ సందర్భంగా, చెట్ల యొక్క ఔన్నత్యాన్ని చాటేలా, భారతీయ సంస్కృతిలో చెట్ల ప్రాముఖ్యతను తెలిపేలా ముద్రించిన “వృక్షవేదం” పుస్తకం గురించి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ప్రతినిధి రాఘవ శ్రీ శ్రీ రవిశంకర్ కి వివరించారు.

అనంతరం స్వామీజీ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం మహోన్నతమైనది. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ప్రకృతిని కాపాడాలనే వారి ఆలోచన అద్భుతమైనది అన్నారు. చెట్లు రెండు రకాలు ఉంటాయి ఒకటి ఫలాలని కాస్తూ.. జీవుల ఆకలి తీర్చేవి, రెండు ఏపుగా పెరిగి జీవులకు నీడనిచ్చేవి. ఇవి రెండు మానవలికి ఉపయోగకరమైనవే. అయితే జీవుల అవసరాలను గుర్తిస్తూ.. అందుకు అనుగుణంగా మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ప్రతినిధులు చేస్తున్న తీరు నన్నేంతో ఆకట్టుకుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీసీ కమీషన్ ఛైర్మన్ వకుళా భరణం కృష్ణ మోహన్ రావు, మల్లికార్జున్ రెడ్డి, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” బాధ్యులు రాఘవతో పాటు ఆశ్రమ బాధ్యులు, ఇతర భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -