తొలి వన్డే లంకదే..!

210
Sri Lanka Beat India By 7 Wickets In Dharamsala
- Advertisement -

భారత్- శ్రీలంక మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్ లో తొలి వన్డేలో టీమిండియ ఘోరంగా ఓడిపోగా..లంక జట్టు ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో భారత్ పై శ్రీలంక సునాయాసంగా గెలిచింది. 20.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంక జట్టు 114 పరుగులు చేసింది.

కాగా, ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు అత్యంత ఘోరంగా విఫలమైంది. 27 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. వన్డేల్లో భారత్ అత్యంత తక్కువ స్కోర్ కు ఔటైన రికార్డు నెలకొల్పుతుందేమోననిపించింది.

అయితే, ధోనీ తన దైన శైలిలో బ్యాటింగ్ చేసి ఆ గండం నుంచి బయటపడేశాడు. 38.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయిన భారతజట్టు 112 పరుగులు చేసింది. స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు ఆ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి తొలి వన్డేలో ఘన విజయం సాధించింది.

- Advertisement -