అయోధ్య రామయ్య కోసం ప్రత్యేక వస్త్రాలు

12
- Advertisement -

శ్రీరాముడి విగ్రహా ప్రతిష్ట కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 22న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరగనుండగా కన్నుల పండువగా వేడుక జరిగేలా మోడీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక శ్రీరాముడి కోసం ప్రత్యేకంగా నేసిన వస్త్రాలను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందజేశారు. పుణె హెరిటేజ్‌ హ్యాండ్‌వీవింగ్‌ రివైవల్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వారు ఆ వస్త్రాలను సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ చేతుల మీదుగా శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌ వారికి అందజేశారు.

12 లక్షల మంది భక్తులు ఈ ప్రత్యేక వస్త్రాలను నేశారు. ఈ సందర్భంగా పుణె చారిటబుల్‌ ట్రస్ట్‌ బృందాన్ని యోగీ ఆదిత్యనాథ్‌ అభినందించారు.

Also Read:ఉదయం లేవగానే ఇలా చేస్తే మంచిది..!

- Advertisement -