మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి ప్రముఖ శైవ క్షేత్రాలకు భారీగా ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కీసరగుట్ట, ఏడుపాయలు, బీరంగూడ, ఇతర శైవ క్షేత్రాలకు మొత్తం 440 ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు సజ్జనార్ వెల్లడించారు.
ఈ ప్రత్యేక బస్సులు ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.సికింద్రాబాద్ నుంచి 90 బస్సులు, ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు నుంచి 100 బస్సులు,అమ్ముగూడ నుంచి 70 బస్సులు,ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి 25 బస్సులు మొత్తం కలిపి 285 ప్రత్యేక బస్సులు నడవనున్నట్లు తెలిపారు.
సీబీఎస్ బస్టేషన్ నుంచి మెదక్ జిల్లా ఏడుపాయలకు 125 బస్సులు, పటాన్ చెరు నుంచి బీరంగూడకు 30 బస్సులు నడనున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు ఏవైనా సందేహాలు ఉంటే 9959226160 (కోఠి), 9959226154 (రేతిఫైల్ బస్ స్టేషన్) నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
Also Read:యూపీఐ యాప్స్తో పీఎఫ్ డబ్బు విత్డ్రా!