మొక్కలు నాటిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి….

256
pocharam
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన జన్మదినం సందర్భంగా మినిస్టర్ క్వాటర్స్ లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.

అనంతరం మాట్లాడుతూ తన వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపుతూ 17 వ తేదీన సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ” కోటి వృక్షార్చన ” ఒకే రోజు – ఒకే గంటలో- ఒక కోటి మొక్కలు నాటే కార్యక్రమం లో భాగస్వాములు అయి ప్రతి ఒక్కరు మొక్కులు నాటి మొబైల్ పంపించగలరు అని కోరారు.

ఇందుకోసం మొబైల్ యాప్ కోసం మీ వాట్సప్ నుండి 9000365000 నెంబర్ కు GIC అని మెసేజ్ చేయాలని పిలుపునిచ్చారు.హరిత సంకల్పంలో మీ కృషికి గుర్తింపుగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి వనమాలి బిరుదును మీకు ఈ మెయిల్ , మొబైల్ కు వారం రోజుల్లో పంపబడుతుంది తెలిపారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.

- Advertisement -