సీఎం కేసీఆర్‌ని కలిసిన మంత్రులు,ఎమ్మెల్యేలు

392
cm kcr
- Advertisement -

నూతన సంవత్సరం సందర్భంగా ప్రగతిభవన్‌లో పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు . సీఎంని కలిసిన వారిలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, పలువురు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, జెన్ కో – ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు తదితరులున్నారు.

హైస్కూల్ విద్యార్థులకు అందించే మోడల్ డిక్షనరీని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు.ఐనవోలు దేవాలయం, యాదాద్రి దేవాలయ క్యాలండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టిఎస్పిఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, వివిధ కమిషన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు , టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు, లోకసభ పక్ష నేత నామా నాగేశ్వర్ రావు కలిసిన వారిలో ఉన్నారు.

ali

- Advertisement -