మెగా ఫ్యామిలీలో ఇతని దారే వేరు. తనకు నచ్చిన దారిలోనే వెళ్లాలనుకుంటాడు. అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోకుండా కంచె సినిమా లాంటి ప్రయోగాత్మక చిత్రాలకు ఎక్కవ మక్కువ చూపుతాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఇటీవల ఫిదా, తొలిప్రేమ సినిమాల సక్సెస్ తో జోరు మీదున్నవరుణ్ తాజాగా మరో ప్రయోగాత్మక చిత్రం ఒప్పుకున్నట్లు సమాచారం.
ఘాజీ సినిమాను డిఫరెంట్ గా తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో దర్శకుడు క్రిష్ నిర్మాణంలో ఓ ప్రయోగాత్మ చిత్రాన్ని చేయనున్నాడు వరుణ్. వరుణ్ సరసన అధితి రావు హైదరి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను పూర్తిగా అంతరిక్ష నేపధ్యంలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బీజీగా ఉంది చిత్ర యూనిట్.
ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్ లో ఇస్రో వాతావరణానికి తగ్గట్టుగా ప్రత్యేక సెట్ వేసి ఈ సినిమాను చిత్రీకరించనున్నారు. ఇటీవల మనముందుకొచ్చిన రంగస్థలం సినిమాలో అచ్చమైన పల్లెటూరి వాతావరణాన్ని సెట్ ద్వారా అద్భుతంగా సృష్టించిన రామకృష్ణ, మౌనికలు ఈ చిత్రానికి కూడా సెట్ వేయనున్నట్లు సమాచారం.