టీ20.. దక్షిణాఫ్రికా ఘన విజయం

373
south-africa
- Advertisement -

బెంగుళూరు వేదికగా జరిగిన చివరి టీ20మ్యచ్ లో ఇండియాపై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దీంతో 1-1తేడాతో సిరీస్ సమం అయింది. చివరి టీ20లో దక్షిణాఫ్రికా 9వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింట్ ఎంచుకున్న టీం ఇండియా నిర్ణిత 20ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 134పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 36 పరుగులతో ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా 3 వికెట్లు, ఫార్టుయిన్ 2, హెండ్రిక్స్ 2 వికెట్లు తీశారు.

ఆ తర్వాత 135పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు అలవోకగా కొట్టేశారు. 16.5ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 140పరుగులు చేసి విజయం సాధించారు. కెప్టెన్ డికాక్ 52 బంతుల్లో 79 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య మాత్రమే వికెట్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్ గెలవడం ద్వారా మూడు మ్యాచ్ ల సిరీస్ ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. తొలి మ్యాచ్ వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే.

- Advertisement -