ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సోనమ్ భార్య

4
- Advertisement -

సోనమ్ ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో కోర్టుకు నా ధన్యవాదాలు. భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య పౌరుడికి తనకు నచ్చిన వైద్యుడు, ఆస్పత్రి, చికిత్సను ఎంచుకునే హక్కు ఉంది అని సోనం వాంగ్‌చుక్ భార్య డాక్టర్ గీతాంజలి ఆంగ్మో తెలిపారు.

సోనంను ఇక్కడికి తీసుకొచ్చిన విధానం వల్ల ప్రభుత్వంపై మాకు నమ్మకం లేకపోయింది. ఆయనను ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం లేదు. జంతర్ మంతర్ వద్దే ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచవచ్చు. కానీ బయటివారిని కలవకుండా చేయడానికే ఆస్పత్రిలో నిర్బంధించినట్లు అనిపించింది.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రాణాపాయ స్థాయిలో లేదు. ప్రభుత్వం కంటే ఆయన ఆరోగ్యం గురించి మేమే ఎక్కువగా ఆందోళన చెందుతున్నాం.నిన్న లాఠీచార్జీకి గురైన విద్యార్థులకు సంఘీభావంగా సోనం తన నిరాహార దీక్షను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి వచ్చిన పలువురు ఎంపీలను కూడా ఆయనను కలవనివ్వలేదు. గత 20 రోజులుగా సోనంకు చికిత్స అందిస్తున్న డాక్టర్ లాంబా, డాక్టర్ దిగేలు కూడా కోర్టులో మాట్లాడుతూ, చికిత్స అందిస్తున్న వైద్యులను సైతం రోగిని కలిసేందుకు అనుమతించలేదని తెలిపారు.

ఆ ఆస్పత్రిలో మాకు అది వైద్యం కంటే నిర్బంధం, బందీ పరిస్థితిలా అనిపించింది. మధ్యాహ్నం తర్వాత కోర్టు లిఖితపూర్వక ఉత్తర్వులు ఇస్తుంది. ఆ తర్వాత సోనంను మేదాంత ఆస్పత్రికి తరలిస్తాము అని చెప్పారు.

- Advertisement -