సోనాలిని పరామర్శించిన నమ్రతా..

274
- Advertisement -

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రేను పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యామిలీ అమెరికాలో విహారయాత్ర చేస్తోంది. ఈ క్రమంలో మహేష్ సతీమణి, నటి నమ్రతా శిరోద్కర్ సోనాలి బ్రిందేను పరామర్శించింది. న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న సోనాలికి నమ్రతా దైర్యాన్ని చెప్పింది. ఓ ఇంటర్క్యూలో మాట్లాడుతూ నమ్రతా ఈ విషయాలు వెల్లడించింది.ఈ మేరకు నమ్రతా మాట్లాడుతూ సోనాలి చాలా దృఢమైన మహిళ అని.. ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న సోనాలి.. త్వరలోనే మామూలు జీవితం గడపనున్నట్లు తెలిపింది. ఆమెతో కాసేపు సరదాగా సమయం గడిపానని.. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నానని నమ్రత చెప్పింది. సోనాలి ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని దేవుడిని ప్రార్థిస్తూనే ఉంటానని మాట ఇచ్చానని పేర్కొంది. ఇద్దరం కలిసి సెంట్రల్ పార్క్‌లో వాకింగ్ చేయాలనుకున్నాం కానీ.. కుదరలేదని.. త్వరలోనే ఆమెను మళ్లీ కలిసి సెంట్రల్ పార్క్‌లో వాకింగ్ చేస్తానని తనకు మాట ఇచ్చినట్లు నమ్రత వెల్లడించింది.

- Advertisement -