TTD:బ్రేక్ ద‌ర్శ‌నం భక్తులకు ఎస్ఎంఎస్ పే సిస్ట‌మ్‌

22
- Advertisement -

తిరుమల శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం విచ‌క్ష‌ణ కోటాలో కేటాయించే బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్లు పొందే భ‌క్తుల సౌక‌ర్యార్థం టీటీడీ నూత‌నంగా ఎస్ఎంఎస్ పే సిస్ట‌మ్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీ నుండి ఈ విధానాన్ని అమ‌లుచేస్తోంది.

నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ ను పంపుతారు. భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి యుపిఐ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్ లో సొమ్ము చెల్లించి ఎంబీసీ-34 కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా బ్రేక్ ద‌ర్శ‌న‌ టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్ప‌టికే ఆఫ్‌లైన్‌లో సిఆర్ఓలో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవాటికెట్లు పొందుతున్న‌ భక్తులకు ఈ విధానం అమ‌లు చేస్తున్నారు.

Also Read:రజినీ అందుకే ప్రొడ్యూస్‌ చేయలేదు

- Advertisement -