కరోనాను జయించిన చిన్నారి..

205
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం కరోనాను తరిమికొట్టేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ఇప్పటివరకు కరోనా జయించి కొలుకున్నవారు ఎంతో ఆనందంగా తీరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు.. గాంధీ వైద్యులు అందిస్తున్న వైద్య సేవలను భేష్ అంటూ కొనియాడుతున్నారు. ఇవ్వాళ గాంధీ వైద్యులు ఓ తల్లి కి మాతృ ప్రేమ అందించారు. 20 రోజుల క్రితం కరోనా సోకిన తన బిడ్డతో ఎంతో ఆందోళనతో గాంధీలో అడుగుపెట్టిన ఆ తల్లి ఈ రోజు సంతోషంతో ఇంటికి వెళ్లింది.. కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకుని అతిపిన్న వయస్కుడు గాంధీ ఆస్పత్రి నుంచి ఇవ్వాళ డిశ్చార్జ్ అయ్యాడు.

Gandhi Hospital

ఈ నెల 10న మహబూబ్ నగర్ జిల్లా మర్లు గ్రామానికి చెందిన రోజుల చిన్నారికి విరోచనాలు అవడంతో ఆస్పత్రికి తరలించారు. కరోనా పోసిటివ్ రావడంతో గాంధీకి తరలించి వైద్య చికిత్సలు అందజేశారు. కొలుకోవడంతో మళ్ళీ ఆరోగ్యవంతుడిగా తల్లి వడికి చేరాడు చిన్నారి. ఈ చిన్నారితో పాటు 13 మంది పిల్లలు కరోనాను జయించి సంతోషంగా ఇంటికి వెళ్ళారు.

kids

- Advertisement -