దేశాభివృద్ధికి తోడ్పడండి: ఎస్‌కే జోషి

461
sk josh
- Advertisement -

దేశం అభివృద్ధి చెందడానికి ఎన్నో వనరులున్నాయని…అంతా దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి. హైదరాబాద్ డా. బి ఆర్ అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో వి.హబ్ ప్రాంగణం లో వి.హబ్ స్టార్టప్ ఫస్ట్ స్టేజి గ్రాడ్యుయేషన్ డే సెలెబ్రేషన్స్ కు ఎస్‌కే జోషితో పాటు ఐ టి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్‌కే జోషి మీరు నేర్చుకున్న దానిని సమాజానికి ఉపయోగపడేలా చేయాలన్నారు. దేశంలో అభివృద్ధి చెందడానికి ఎన్నో వనరులు ఉన్నాయి…అందరికి మీరు ఆదర్శంగా నిలవాలన్నారు.

సమస్యల పరిష్కరనికి వి.హబ్ కృషి అభినందనీయం అని తెలిపారు జయేష్ రంజన్.మీరు చేసిన స్టార్టప్ చూసి చాలా మంది మహిళలు ముందుకు రావాలి…ఇప్పటికే జిల్లాలో మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం అని చెప్పారు.

- Advertisement -