పోలీసులను ఆశ్రయించిన సింగర్ కౌసల్య

409
Kousalya
- Advertisement -

ప్రముఖ సింగర్ కౌసల్య సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కౌసల్యకు సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువ అవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కౌసల్యకు ఈమధ్య చాలా మంది వాట్సాప్ లో అస్యభ్య పదజాలంతో మెసెజ్లు చేస్తున్నారట. కొంత మంది ఆకతాయిలు తన ఫోన్ నెంబర్ తెలుసుకుని రోజూ దరిద్రమైన మెసేజ్‌లు పంపిస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ తన బాధను వ్యక్తం చేశారు.

ఒకటి రెండు అంటే బ్లాక్ చేస్తే సరిపోతుంది కానీ..ఆమెకు ఏకంగా 342 నెంబర్ల నుంచి మెసెజ్ లు వచ్చాయట. దీంతో విసిగిపోయిన కౌసల్య పోలీసులను ఆశ్రయించింది. కౌసల్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే కౌసల్యకు గత కొద్ది రోజులుగా అవకాశాలు రాకపోవడంతో ఆమె ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటుంది. ఈ మధ్యే ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుంది కౌసల్య. సంగీత నేపథ్యం ఉన్న ఓ వెబ్‌ సిరిసీలో ఆమె నటించనుందని సమాచారం.

- Advertisement -