క‌రోనా సోకి ప్ర‌ముఖ సింగ‌ర్ మృతి

249
corona in Telangana
- Advertisement -

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వణికిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు 199 దేశాల‌కు సోకిన ఈ వ్యాధి దాదాపు 7ల‌క్ష‌ల‌కు పైగా మందికి పాజిటివ్ వ‌చ్చింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 30వేల మంది క‌రోనా వ‌ల్ల మ‌ర‌ణించారు. సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు ఎవ‌ర్ని వ‌ద‌ల‌ట్లేదు క‌రోనా. తాజాగా ప్ర‌ముఖ కంట్రీ సింగ‌ర్, గ్రామీ అవార్డు విజేత జోయ్ డిఫ్పి క‌రోనా సోకి మృతి చెందారు.గత కొద్దిరోజులుగా కరోనా వైరస్‌తో బాధపడుతున్న ఆయన నిన్న సాయంత్రం మ‌ర‌ణించారు.

మూడురోజుల క్రితం తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకుంటున్నానని ఆయన సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. ‘ నేను, నా కుటుంబం ఈ సమయంలో ప్రైవసీని కోరుకుంటున్నాం. అభిమానులకు మేమొక్కటే చెప్పదల్చుకున్నాం.. కరోనా మహమ్మారినుంచి తప్పించుకోవటానికి చాలా జాగ్రత్తగా ఉండండ’ని పేర్కొన్నారు. ఇండియాలో క‌రోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1000కి చేరింది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొన‌సాగుతున్నా క‌రోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

- Advertisement -