సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు..

207
cm kcr
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ తరుపున రాజ్యసభ అభ్యర్థులుగా తమను ఎంపిక చేయడంపై జోగినపల్లి సంతోష్ కుమార్, లింగయ్యయాదవ్, బండ ప్రకాష్ లు సీఎం కేసీఆర్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. యాదవ, ముదిరాజ్ కుటుంబాలకు చెందిన తమను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింనందుకు సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామని, తమ మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానీయబోమని లింగయ్య యాదవ్, బండ ప్రకాష్ ముదిరాజ్ లు తెలిపారు. సీఎం కేసీఆర్ భారతదేశ దిక్సూచీ అని బండ ప్రకాష్, లింగయ్య యాదవ్ లు అన్నారు. రాజ్య సభ ఎన్నికల్లో రెండు సీట్లను బీసీలకు ఇవ్వడం సామాజిక న్యాయానికి ప్రతీక అని అన్నారు. అటు రాజ్య సభ అభ్యర్థిగా తనను ఎంపిక చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -