హరీష్‌ రావు పిలుపు.. సిద్ధిపేటలో విరాళాల వెల్లువ..

194
harish rao
- Advertisement -

జిల్లా నుండి కరోనా కట్టడికి ఆపన్న హస్తం అందిచాలని మంత్రి హరీశ్ రావు పిలుపు మేరకు సిద్ధిపేట జిల్లాలోని పలువురు దాతలు తమవంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. వీటికి సంబంధించిన చెక్కులను మంత్రి హరీష్ రావుకు శుక్రవారం అందించారు.

సిద్ధిపేట వైద్యుల ఆధ్వర్యంలో రూ.7 లక్షల రూపాయల విరాళం అందించారు.అలాగే సిద్ధిపేట జిల్లా ఐఏంఏ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ రూ.10వేల చొప్పున్న రూ.3 లక్షలు విరాళ చెక్కులను మంత్రి హరీశ్ రావుకు అందించారు. మరోవైపు సిద్ధిపేటలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ సురేంద్ర రూ.1 లక్ష 8వేల రూపాయలు విరాళాన్ని చెక్కు రూపంలో మంత్రి హరీశ్ రావుకు అందించారు. దాతలు అందించిన విరాళాలను మంత్రి స్వీకరిస్తూ.. వారిని అభినందించారు.

- Advertisement -