బంతిపై ఉమ్మిన ఇంగ్లాండ్ క్రికెటర్‌..శానిటైజ్‌ చేసిన అంపైర్!

224
england cricketer
- Advertisement -

వెస్టిండీస్ – ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండోటెస్టులో ఆసక్తికర పరిణామం చోటుచేసుంది. ఆట నాలుగోరోజు పొరపాటున ఇంగ్లాండ్ క్రికెటర్‌ డామ్ సిబ్లే పొర‌పాటును బంతికి ఉమ్మి అంటించాడు. తాను చేసిన పొరపాటును గమనించిన సిబ్లే…అంపైర్లకు చెప్పడంతో వారు బంతిని శానిటైజ్ చేశారు.

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో బంతికి ఉమ్మి రాయ‌కూడ‌ద‌ని ఐసీసీ తాత్కాలికంగా ఈ నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది. ఒక ఆటగాడు మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తే వార్నింగ్ ఇస్తారు… రెండు సార్లు అధిగమిస్తే ఆ జ‌ట్టుపై 5 ప‌రుగుల పెనాల్టీ విధించనున్నారు.

తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 287 పరుగులు చేయగా అనంతరం నాలుగ‌వ రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇంగ్లండ్ రెండు వికెట్లు కొల్పోయి 37 ర‌న్స్ చేసింది.

- Advertisement -