- Advertisement -
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 9న శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి , శ్రీ కృష్ణ స్వామివారిని కపిలతీర్ధంలోని ఆళ్వార్తీర్ధంకు తీసుకువెళ్ళి, స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహించారు.
సాయంత్రం 4.30 గంటలకు శ్రీ భూ సమేత గోవిందరాజస్వామివారు ఆర్.ఎస్. మాడ వీధిలోని శ్రీ వైఖానసాచార్యులు ఆలయంలో ఆస్థానం నిర్వహించి, అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
Also Read:బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి:కేటీఆర్
- Advertisement -

