శ్రద్దాకపూర్‌ ను కలిసిన దావుద్ ఇబ్రహీం ఫ్యామిలీ..

249
Shraddha Kapoor
- Advertisement -

బాలీవుడ్‌ లో ఈ మధ్య బయోఫిక్ సినిమా సందడి ఎక్కువైంది. బాలీవుడ్ తారలు ఎక్కువగా వ్యక్తుల జీవితకథను సినిమాగా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే మేరికోమ్, సుల్తాన్ వంటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. దీంతో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దాకపూర్‌ ఆసక్తికలిగించే వ్యక్తి జీవిత కథను తెరపై ఆవిష్కరించనుంది. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘హసీనా’. ఈ చిత్రంలో హసీనా పాత్రను బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ పోషిస్తోంది.

Shraddha Kapoor

ఈ చిత్రం షూటింగ్ ముంబయిలోని మెహబూబ్ స్టూడియోస్ లో జరుగుతోంది. అయితే ‘హసీనా’ షూటింగ్ జరుగుతున్న సమయంలో దావూద్ కుటుంబ సభ్యులు షూటింగ్ సెట్స్‌ వెళ్లి శ్రద్ధాకపూర్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులను కలిశారట. దావూద్ సోదరి హసీనా పార్కర్ ముగ్గురు పిల్లలు అలీషా, ఉమరియా, ఖుషియాన్ తో పాటు ఆమె సోదరుడు సమీర్ అంతులే అక్కడికి వెళ్లారు. దావూద్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోగానే శ్రద్ధతో పాటు యూనిట్ సభ్యులు కూడా కొంచెం భయపడ్డారట. అయితే, ఆ తర్వాత అంతా మామూలుగానే ఉందని యూనిట్ సభ్యులు చెప్పారు.

Shraddha Kapoor

ఈ చిత్రం షూటింగ్ చూసిన హసీనా కుటుంబ సభ్యులు చాలా సంతోషపడ్డారట. హసీనా తన నిజజీవితంలో ఉపయోగించిన రీడింగ్ గ్లాసెస్, ముక్కుపుడక, ఇష్టమైన లిప్ స్టిక్ ను శ్రద్ధాకపూర్ కు ఆమె కుటుంబ సభ్యులు బహూకరించారని సమాచారం. కాగా, అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలైంది. హసీనా పార్కర్ భర్త పాత్రలో అంకుర్ భాటియా, సోదరుడు దావూద్ పాత్రలో శ్రద్ధాకపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ నటిస్తున్నారు.

- Advertisement -